జాతి రత్నం కాబోతున్న అల్లు హీరో..!

-

మెగా హీరోల్లో ఇంకా టాలెంట్ చూపించాల్సిన హీరోగా బాకీ ఉన్నాడు అంటే అది ఒక్క అల్లు శిరీష్ అని చెప్పాలి. గౌరవంతో ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఒక్క క్షణం వరకు చేసిన 4,5 సినిమాలతో నటుడిగా ఏమంత ప్రూవ్ చేయలేకపోయాడు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు కాస్త పర్వాలేదు. అయితే ప్రస్తుతం మళయాళ ఎబిసిడి మూవీ రీమేక్ గా వస్తున్న సినిమాలో నటిస్తున్న అల్లు శిరీష్ తన తర్వాత సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

శిరీష్ తన నెక్స్ట్ మూవీ మారుతి డైరక్షన్ లో చేస్తాడని అంటున్నారు. శైలజా రెడ్డి అల్లుడు తర్వాత మారుతి కూడా తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేయలేదు. రెండేళ్ల క్రితం రాసుకున్న కథను మారుతి శిరీష్ తో చేస్తున్నాడట. ఈ సినిమాకు టైటిల్ గా జాతి రత్నం అని పెట్టబోతున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా వస్తుందని అంటున్నారు.

స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కోసం మారుతి కొన్నాళ్లుగా ట్రై చేస్తుండగా బన్నితో కుదరడం లేదు కాని శిరీష్ మాత్రం మారుతికి ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ఆల్రెడీ కొత్తజంట సినిమా వచ్చింది. మరి ఈసారి ఈ జాతి రత్నం ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news