ఆ విషయంలో ప్రభాస్ ను బీట్ చేసిన అనుష్క.. ఫ్యాన్స్ ఫుల్ కుషీ..!

-

అనుష్క శెట్టి.. సూపర్ సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ అందాల ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషలలొ నటించి తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ఇకపోతే బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బొమ్మాళీ.. ఇప్పుడు తాజాగా మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

సోషల్‌ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్‌ బుక్‌ లో 23 మిలియన్‌ ఫాలోవర్స్‌ని సాధించి కాజల్‌, తమన్నాల సరసన చేరింది స్వీటీ అనుష్క. ఈ విషయంలో టాప్‌ సెలబ్రిటీలైన రజినీకాంత్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ వంటి వారిని బీట్‌ చేసి హీరోయిన్లు టాప్‌ ప్లేస్‌ని సొంతం చేసుకోవడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అమోజాన్ ప్రైమ్ దాదాపు 25 కోట్ల పెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news