‘బలగం’ డైరెక్టర్​ వేణు కొత్త సినిమా అప్డేట్​

-

బలగం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం.. ఓవైపు కలెక్షన్లు.. మరోవైపు అవార్డులు సొంతం చేసుకుంది. ప్రాంతీయ చిత్రంగా విడుదలై.. అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇక ఈ సినిమాతో.. ‘జబర్దస్త్‌’ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాస్య నటుడు వేణు యెల్దండి దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు. తన చిత్రంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఆయన నెక్ట్స్​ సినిమా అనౌన్స్​మెంట్​ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా మంది సినీ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే వేణు తన కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. తన రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని సోమవారం ప్రారంభించినట్టు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. పెన్ను, పేపర్‌ ఫొటోను షేర్‌ చేశారు. ఆ కాగితంపై శ్రీ ఆంజనేయ అని రాసి ఉంది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. ‘మరో ‘బలగం’గా మంచి సక్సెస్​ను అందుకోవాలని కోరకుంటున్నా’, ఆల్‌ ది బెస్ట్‌ వేణు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news