మంత్రి రోజాకు సన్మానం చేయాలి : బండ్ల గణేష్

-

మంత్రి రోజాపై నిర్మాత బండ్ల గణేష్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేబినేట్‌ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్న రోజాకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు బండ్ల గణేష్‌. ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ కు ఇటీవల బండ్ల గణేష్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ మాట్లాడుతూ… ఏపీ మంత్రి రోజాకు తెలుగు చిత్ర పరిశ్రమ సన్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.

రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు మంత్రి పదవి దక్కడం చాలా గ్రేట్‌ అని కొనియాడారు. మంత్రి పదవి చేపట్టిన రోజాకు తగిన సన్మానం చేయాల్సిన బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమపై ఉందని వివరించారు బండ్ల గణేష్‌.

రోజాను సన్మానించే విషయమై సినీ పెద్దలు కూర్చొని త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు. రోజాను మంత్రి చూడటం చాలా ఆనందంగా అనిపిస్తోందని చెప్పారు. ఆర్కే రోజా కు మంత్రి ఇచ్చిన ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news