సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ వార్తలపై షాకింగ్ కామెంట్స్ చేసిన భాగ్యశ్రీ..!

-

మైనే ప్యార్ కియా సినిమాలో జోడిగా సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి నటన హై పీక్స్ కి వెళ్ళింది. ముఖ్యంగా వీరి నటనకు ఫిదా కానీ అభిమానులు ఉండరేమో.. అంతలా కెమిస్ట్రీ పండేది.. అయితే వీరిద్దరి మధ్య ఎంతలా రూమర్స్ సృష్టించారు అంటే వీరిద్దరూ సినిమా ల నుంచీ తప్పుకునేంతలా సృష్టించారు. అయితే దీనిపై తాజాగా భాగ్యశ్రీ స్పందిస్తూ ఎమోషనల్ అయింది..

తెలుగులో యువరత్న రాణా,ఓంకారం వంటి సినిమాలలో నటించిన ఈమె మైనే ప్యార్ కియా తర్వాత వివాహం చేసుకుంది.అయితే మైనే ప్యార్ కియా సినిమా ముగిసిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్ తో ఆమెకు ఎఫైర్ వార్తలు సృష్టించారు. దానివల్ల తానెంతో ఇబ్బందులకు గురయ్యాను అంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాదు తన మొదటి బిడ్డ అభిమన్యు పుట్టినప్పుడు జరిగిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది. నేను మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆసుపత్రిలో ఉన్నాను. ఒక రిపోర్టర్ బొకేతో వచ్చి నన్ను కలవాలని రూమ్ బయట నిలబడి.. నా భర్త సోదరిని అనుమతి కోరింది . ఆమె లోపలికి అనుమతించిన తర్వాత నా భర్త వైపు చూసి భాగ్యశ్రీ కి సల్మాన్ తో అక్రమ సంబంధం ఉంది. ఇప్పుడు ఆమె మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.. మీరు ఎలా ఫీలవుతున్నారని అడిగారు అంటూ ఆమె గుర్తు చేసుకుంది.

దాంతో తాను ఒక్కసారిగా షాక్ అయ్యాను అని.. అప్పటివరకు తాను అలాంటి మాటలు వినలేదు అని చెప్పుకొచ్చింది. ఎటువంటి తప్పుడు సంబంధం లేదు.. అని ఎవరు కూడా అలా అనలేదు అంటూ ఎమోషనల్ అయింది భాగ్యశ్రీ. ఇక దీంతో బిడ్డ పుట్టిన తర్వాత సినిమా మ్యాగ్జిన్స్ కూడా చదవడం మానేశాను.. చిత్ర పరిశ్రమ కి కూడా దూరంగా ఉండిపోయాను అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news