ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపాడు – వైఎస్ షర్మిల

-

ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు…ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపాడని వైఎస్‌ షర్మిల ఆగ్రహించారు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశాడు…గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించాడు…ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు దొర అంటూ నిప్పులు చెరిగారు.

sharmila

9 ఏళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించాడు…బీసీలకు 55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కాని రూపాయి ఇచ్చింది లేదని విమర్శలు చేశారు. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి లోన్ ఇవ్వలేదని..బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదని మండిపడ్డారు.

ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదు..ఐదేండ్ల కింద హామీ ఇచ్చిన ‘బీసీ సబ్ ప్లాన్’ అటకెక్కిందని ఆగ్రహించారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది…మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యతే లేదని తెలిపారు వైఎస్‌ షర్మిల. బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదు…బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెర చాటున కేంద్రంతో లాలూచీ పడ్డాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news