బిగ్ బాస్: అఖిల్, అభిజిత్ మాట్లాడుకోకూడదట.. అమ్మ రాజశేఖర్ వింత వాదన..

-

బిగ్ బాస్ ఎనిమిదవ వారం నామినేషన్స్ రసవత్తరంగా జరిగాయి. వాదోపవాదాల నడుమ హౌస్ అంతా గరం గరం అయ్యింది. ఐతే ఈ నామినేషన్స్ లో అమ్మ రాజశేఖర్ వాదన చాలా మందికి విచిత్రంగా తోచింది. అఖిల్ ని నామినేట్ చేస్తూ, దానికి గల కారణాన్ని అభిజిత్ తో అఖిల్ మాట్లాడడం అని చూపాడు. ఇదే అందరికీ విచిత్రంగా ఉంది. హౌస్ లో ఇప్పుడిప్పుడే ఇద్దరూ స్నేహంగా మెలుగుతున్న సంగతి అందరూ చూస్తున్నారు. అదీగాక హౌస్ లో నాకు నచ్చిన వ్యక్తి అభిజిత్ అని చెప్పి పాజిటివ్ నెగెటివ్ పాయింట్లు కూడా అఖిల్ రాసాడు.

ఐతే వీరిద్దరూ మొదట్లో అంతగా స్నేహంగా ఉన్నట్టు కనిపించలేదు. ఇప్పుడు స్నేహంగా కనిపించడం నాకు నచ్చలేదని అమ్మ రాజశేఖర్, అఖిల్ ని నామినేట్ చేసాడు. ఈ నేపథ్యంలో అఖిల్, అమ్మ రాజశేఖర్ ల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. కుమార్ సాయి విషయాన్ని కారణంగా చూపడం ఫర్వాలేదనిపించినా, ఇద్దరు మాట్లాడుకోవడం నచ్చలేదు అనడమే బాలేదని చాలామంది అభిప్రాయం.

ఐతే నామినేషన్స్ లోకి ఆరుగురు వచ్చారు. ఆరియానా, లాస్య, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, అఖిల్, మోనాల్.. ఆరియానా అరుపులు, మోనాల్ ఏడుపులు, అభిజిత్ ప్లానింగ్ లో మార్పులు, మొదలగునవి ఆటని మరింత ఆసక్తికరంగా చేసాయి. మొదటిసారిగా నోయల్ సరైన రీజన్ తో నామినేట్ చేసినట్టుగా అనిపించింది. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా అవినాష్ ద్వారా లాస్య నామినేషన్స్ లోకి వచ్చింది. ఏదైతేనేం మొత్తానికి హౌస్ లో చాలా మార్పులు వస్తున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి నామినేట్ చేయడం బాగుంది. మరి ఈ సారి హౌస్ నుండి ఎవరు బయటకి వెళ్తారో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news