నిహారిక విడాకుల వార్తపై రంగంలోకి దిగిన చిరంజీవి..!

-

చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త చైతన్యా నుంచి విడాకులు తీసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక వార్త బాగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిలో ఏది సరైనది.. ఏది సరైన వార్త కాదు అని అయోమయంలో మెగా అభిమానులు కూడా ఉన్నారు. ఇకపోతే గత కొన్నాళ్లుగా వీరిద్దరి విడాకులు వ్యవహారానికి సంబంధించి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

2020 డిసెంబర్లో నిహారిక , చైతన్య జొన్నల గడ్డను వివాహ మాడారు. అప్పట్నుంచి ఆమె వైవాహిక జీవితంలో సంతోషంగా కలిసే ఉన్నారు. అయితే అనూహ్యంగా వీరిద్దరికి సంబంధించి డివోర్స్ వ్యవహారం కొంతకాలం క్రితం తెరపైకి వచ్చింది. నిహారిక భర్త చైతన్య తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు.. అలాగే నిహారికతో దిగిన ఒక్క ఫోటో కూడా ఇప్పుడు ఆయన ఇంస్టాగ్రామ్ ఖాతాలో లేదు. దీంతో నిహారిక , చైతన్య మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. అందుకే చైతన్య ఇలా పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడనే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.

ఇకపోతే మెగా కుటుంబానికి సంబంధించి ఏదైనా వార్త వస్తే మొదటిగా స్పందించేది నాగబాబు.. అలాంటి వ్యక్తి కూతురు విడాకులకు సంబంధించి వార్తలు వస్తున్న ఖండించకపోవడంతో మెగా అభిమానుల అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరికి సర్ది చెప్పడానికి చిరంజీవి రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరిచి ఇద్దరినీ మళ్ళీ సంసారం చేసుకునే దిశగా ఆయన వారికి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి పెదనాన్న చిరంజీవి మాట మేరకు వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news