Chiranjeevi: మరో మెగా హీరోతో చిరంజీవి సినిమా..ఈ సారీ రీమేక్!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. మంగళవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటించారు. ఇద్దరు మెయిన్ హీరోయిన్స్ కాగా, మరో హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేసింది. వారు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రెజీనా కసాండ్రా.

చిరుకు జోడీగా కాజల్, చెర్రీ సరసన పూజ నటించగా , ‘చానా కష్టం వచ్చిందే మందాకిని’అనే స్పెషల్ సాంగ్ రెజీనా చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్ లో పెట్టిన చిరు.. మరో పిక్చర్ కోసం డిస్కషన్స్ స్టార్ట్ చేశారట. ‘ఆచార్య’ తర్వాత చిరు చేస్తున్న ‘గాడ్ ఫాదర్, భోళా శంకర్’ రెండు చిత్రాలు రీమేక్స్ కాగా, బాబీ డైరెక్షన్ లోని మెగా 154, యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా ఒరిజినల్ స్టోరిస్.

ఈ క్రమంలోనే మరో రీమేక్ సినిమా చేయాలనుకుంటున్నారట చిరు. అది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘బ్రో డాడీ’. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడంతో పాటు ఈ పిక్చర్ ను డైరెక్ట్ చేసే బాధ్యతను చిరంజీవి ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

ఈ విషయమై అఫీషియల్ గా ఎటువంటి సమాచారం లేదు. ఇకపోతే ఒరిజినల్ ఫిల్మ్ లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లు తండ్రీ తనయులుగా నటించారు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్ర తెలుగు రీమేక్ లో చిరుకు తనయుడిగా సాయిధరమ్ తేజ్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. ఈ వార్తల్లో నిజమెంతుందో..

Read more RELATED
Recommended to you

Latest news