క్రేజీ కాంబో మూవీ క్యాన్సిల్

-

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి మూవీ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తాడని అన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా కూడా ఉంటుందని అన్నారు. కాని ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసిందని తెలుస్తుంది. చిరంజీవి సైరా సినిమా లేట్ అవుతున్న కారణంగా కొరటాల శివ సినిమా క్యాన్సిల్ చేశారట. అంతేకాదు అల్లు అరవింద్ త్రివిక్రం తో చిరు సినిమా చేయాలని చూస్తున్నాడు. అందుకే కొరటాల శివ సినిమా వాయిదా వేశారట.

భరత్ అనే నేను తర్వాత చిరు కోసం ఓ కథ రాసుకున్నాడు కొరటాల శివ. ఇప్పుడు చిరు హాండ్ ఇచ్చేసరికి మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా చేయాల్సి ఉంది. అయితే సుక్కు సినిమా సబ్జెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. అందుకే కొరటాల శివతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట మహేష్.

Read more RELATED
Recommended to you

Latest news