టాలీవుడ్ కు శుభవార్త.. ఏపీలో 5వ షోకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏపీలో చిన్న సినిమాలు ఐదుసార్లు నడుపుకోవచ్చు అని… ఇవాళ జరిగిన ఆ టాలీవుడ్ ప్రముఖుల సమావేశంలో సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మీడియాకు తెలిపారు.

ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నామని.. చిన్న సినిమాలకు ఐదవ షోకు సిఎం జగన్ అంగీకారం తెలిపారని – చిరంజీవి పేర్కొన్నారు. సీఎం తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కన్పిస్తామని చెప్పారని వెల్లడించారు.

ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారికి చెప్పడం జరిగిందని.. . ఈరోజు సహృద్భావంగా ఈ చర్చ ముగిసిందని చెప్పారు చిరంజీవి. దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలుఅన్నారు… హోప్ ఫుల్లీ ఈ నెల మూడవ వారం లోపల జీవో వచ్చే అవకాశం ఉంది… ఎంత తొందరగా జీవో వస్తే అంత తొందరగా సినీ పరిశ్రమ ముందుకు వెళ్తుందని వివరించారు చిరంజీవి.

 

Read more RELATED
Recommended to you

Latest news