అనుష్క తర్వాత ఆ క్రేజ్ అండ్ క్రెడిట్ కాజల్ అగర్వాల్ కే ..!

-

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ లాంగ్ టైం సక్సస్ ఫుల్ కెరీర్ ని లీడ్ చేయడం చాలా కష్టం. హీరోల కంటే హీరోయిన్స్ కి మూవీ కెరీర్ స్పాన్ చాలా తక్కువన్న విషయం అందరికి తెలిసిందే. అయితే వేళ్ళ మీద లెక్కపెట్టే వాళ్ళు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దాదాపు 15 వరకు సక్సస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తుంటారు. అలాంటి వాళ్ళలో అనుష్క తర్వాత కాజల్ అగర్వాల్ గురించి చెప్పుకోవాలి. ఈ ఇద్దరు ఇండస్ట్రీకొచ్చి 12 ఏళ్ళు దాటిపోయింది.

 

అనుష్క, కాజల్ ఇద్దరు కూడా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను స్టార్స్ సరసన నటించి ఒక వెలుగు వెలుగుతున్నారు. మద్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పటికి ఆ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేస్తూ మళ్ళీ భారీ సినిమాలనే చేజిక్కించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ విపరీతమైన క్రేజ్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ అంటే ఒక్క ప్రభాసే ఉన్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తో ఆ క్రేజ్ ఎన్.ట్.ఆర్, రాం చరణ్ లకు రాబోతుంది.

అయితే హీరోయిన్ గా పాన్ ఇండియా సినిమాలో నటించిన క్రేజ్ అనుష్క సాధించింది. బాహుబలి ఫ్రాంఛైజీ లో నటించిన అనుష్క కి హీరోల కి వచ్చినంత పాపులారిటి రావడం విశేషం. ఇప్పుడు ఆ క్రేజ్ ని కాజల్ అగర్వాల్ సాధించబోతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ప్రస్తుతం తన చేతిలో ఉన్నవన్ని పాన్ ఇండియా సినిమాలు కావడం. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్నాయి. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అలాగే స్టార్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న తుపాకి 2 లో కాజల్ నటిస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలోనే తెరకెక్కిస్తున్నారు. దీంతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ఒకే ఒక్క హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news