నాగార్జున హీరోయిన్‌కు 50 ఏళ్లు వ‌చ్చినా ఇంత అంద‌మా…

-

దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు సినిమాలు బాగా చూసే వాళ్లు… తెలుగు సినిమాల‌పై అవ‌గాహ‌న ఉన్న వాళ్లు అంత ఈజీగా మరిచిపోలేని హీరోయిన్లలో ఒకరు దీప్తీ భట్నాగర్. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లి సందడి సినిమాలో స్వప్న సుందరిగా, కింగ్ నాగార్జున ఆటోడ్రైవర్‌లో మిస్ ఇండియాగా ఆకట్టుకుంది. ఆ త‌ర్వాత కూడా ఆమె త‌క్కువ సినిమాల్లోనే న‌టించినా ఆమె అందంతో చెర‌గ‌ని ముద్ర వేసింది. తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో గుర్తుండిపోయింది.

ఇక చాలా సంవత్సరాల కిందటే పుల్‌స్టాప్ పెట్టేసిన ఈ నటీమణి చక్కగా పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఖాళీగా ఉండ‌కుండా ఓ ట్రావెలాగ్ చేస్తుండ‌గా… ఆ కార్య‌క్ర‌మం కూడా హిట్ అయ్యింది. ఇక ఇటీవ‌లే ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తాను గుర్తున్న వాళ్ల‌కు షాక్ ఇస్తోంది. ఇప్ప‌టికే 50 సంవ‌త్స‌రాల‌కు చేరువు అయిన దీప్తి అందాల‌ను చూస్తుంటే మ‌తులు పోతున్నాయి.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోన్న దీప్తి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ఆశ్చర్యపరచకమానవు. ఈమెకు 50 యేళ్లు వయసు వచ్చినా అందం వన్నె తగ్గలేదని స్పష్టం అవుతోంది. చాలా మంది న‌టీమ‌ణులు వ‌య‌స్సు పైబ‌డ్డాక గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డం చూశాం.. కానీ 50 ఏళ్ల వ‌య‌స్సులో కూడా మ‌లైకా అరోరాతో పాటు దీప్తి లాంటి వాళ్లే ఇంత అందంగా క‌నిపిస్తున్నారు. మ‌రి దీప్తి అందాల ఫొటోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news