ఖచ్చితంగా బాహుబలి ని మించి ఇస్తా …రాజమౌళి

-

కరోనా ఎఫెక్ట్ తో సినిమాలన్నీ షట్ డౌన్ అయ్యాయి. షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయి అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. దాంతో కొత్త సినిమా రిలీజులు లేవు.. ప్రమోషన్స్ లేవు. కానీ రాజమౌళి టీమ్ ఒక్కసారిగా ‘ ఆర్.ఆర్.ఆర్ ‘ ప్రమోషన్స్ ని మొదలు పెట్టి అందరికి షాకిచ్చారు. గత ఆరు నెలలుగా ఇదిగో అదుగో అంటూ ఊరించిన రాజమౌళి టీం చాలాసార్లు ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి నిరుత్సాహాన్నే మిగిల్చారు. అన్నీ సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి గాని ఎన్.టి.ఆర్, చరణ్ సినిమా ‘ ఆర్.ఆర్.ఆర్ ‘ గురించి మాత్రం రాలేదు. పైగా కొద్ది రోజుల క్రితం ఈ సినిమా జూన్ లో కాదు వచ్చే ఏడాది జనవరి 8 న రిలీజ్ అంటూ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేసి క్లారిటి ఇచ్చారు.

 

దాంతో ఇక ఇప్పుడు ‘ ఆర్.ఆర్.ఆర్ ‘ కి సంబంధించిన న్యూస్ ఏది రాదనుకున్నారు. కాని కరోనా ఎఫెక్ట్ లో అందరూ ఉంటే రాజమౌళి మాత్రం తన సినిమా అప్‌డేట్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తూ సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. అంతేకాదు కాదు రాజమౌళి రీసెంట్ గా బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో ‘ ఆర్.ఆర్.ఆర్ ‘ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాజీవ్ మసంద్ తో సంభాషణలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ముఖ్యంగా ‘ ఆర్.ఆర్.ఆర్ ‘ గురించి చాలా విషయాలు మాట్లాడారు.
తారక్.. రామ్ చరణ్ ఇద్దరి కుటుంబాల మధ్యలో ఎప్పటి నుంచో పోటీ ఉంది. అయితే వారిద్దరూ మాత్రం మంచి స్నేహితులు. ఇద్దరితో నేను గతంలో పని చేశాను. ‘ ఆర్.ఆర్.ఆర్ ‘ సినిమాకు అదే పెద్ద ప్లస్ అని తెలిపారు.

తారక్.. చరణ్ అభిమానుల అంచనాలను దాటి ఆలోచిస్తున్నానని.. చిత్రీకరణ సమయంలో సాధారణ ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఆలోచనతో పనిచేస్తున్నానని తెలిపారు. రాజమౌళి చెప్పిన విషయాలు రీసెంట్ గా రిలీజ్ అయిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ను చూస్తే కరెక్టే అనిపిస్తోంది. ఇక చరణ్ పాత్రను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ప్రెజెంట్ చెయ్యడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news