ఈ సారి జోనర్ మార్చిన దేవకట్టా..క్రిటిక్స్ మెచ్చిన సినిమాకు సీక్వెల్

-

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీసు వద్ద ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, సమాజంపైన బలమైన ప్రభావాన్ని చూపే శక్తి ఆయన సినిమాలకు ఉందని చెప్పొచ్చు.

మరీ ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సినీ అభిమానులకు మాత్రమే కాదు విమర్శకులకూ బాగా నచ్చాయి. అలా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ఫిల్మ్ ‘రిపబ్లిక్’. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటించారు. ఈ పొలిటికల్ డ్రామాలో రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు డైరెక్టర్ దేవకట్టా. అయితే, తాను ప్రజెంట్ వేరే జోనర్స్ లో స్టోరిలు రచించుకుంటున్నానని, ఒకటి లేదా రెండు సినిమాలు వేరే జోనర్ లో తీసిన తర్వాతనే ‘రిపబ్లిక్ 2’ తీస్తానని పేర్కొన్నారు.

‘రిపబ్లిక్’ ఫిల్మ్ ఎండింగ్ లో సాయిధరమ్ తేజ్ చనిపోయినట్లు చూపించారు. ఈ నేపథ్యంలో సీక్వెల్ ఎలా ఉండబోతున్నదనే ఆసక్తి అయితే అప్పుడే నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news