నిజంగానే ఆ డైరెక్టర్ ని గోపీచంద్ మోసం చేశారా.. అసలు విషయం ఇదే..!!

-

డాన్స్ మాస్టర్ గా పేరుపొందారు అమ్మ రాజశేఖర్. వెండితెరపై ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈయన ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ అయ్యారు. అయితే డాన్స్ మాస్టర్ గా చేసిన తర్వాత డైరెక్టర్గా కూడా మారి కొన్ని సినిమాలను తెరకెక్కించారు. కానీ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ డాన్స్ మాస్టర్ గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చాలానే చేస్తున్నారు. అయితే తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మ రాజశేఖర్ హీరో గోపీచంద్ గురించి పలు విషయాలను తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..హీరో గోపీచంద్ తనని మోసం చేశారని విషయాన్ని తెలియజేశారు.. అసలు విషయంలోకి వెళితే గోపీచంద్ మోసం చేశాడన్న మాట వాస్తవమే కానీ ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఎందుచేత అంటే గోపీచంద్ ఎప్పుడు కూడా వివాదాలలో అడుగుపెట్టలేదు. కేవలం తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అటువంటి గోపీచంద్ పై డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఇలా కామెంట్ చేయడంతో అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది.

డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గోపిచంద్ తో కలిసి రణం సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే మరొక సినిమా చేద్దామని అమ్మ రాజశేఖర్ గోపీచంద్ తో అనగా అందుకు కూడా ఓకే అని చెప్పారట గోపీచంద్. అయితే అందుకోసం ఒక కథను కూడా సిద్ధం చేశారట. కానీ ఆ సమయంలో అమ్మ రాజశేఖర్ కు నిర్మాత సురేష్ బాబు తో సినిమా చేసే అవకాశం వచ్చిందట. అందులో హీరోగా వెంకటేష్ నటించగా.. నిర్మాతగా సురేష్ బాబు ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి అనుకుంటున్న సమయంలో గోపీచంద్ సత్యరాజ్ కాంబినేషన్లో వచ్చిన శంఖం సినిమా చూసిన అమ్మ రాజశేఖర్ తను గోపీచంద్ కు వినిపించిన కథలా ఉండడంతో… అప్పుడే నిర్మాత సురేష్ బాబు ఆ కథను వద్దని చెప్పి మరొక కథను చేద్దామని ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టాడట. ఆ సమయంలో తను ఎంతో బాధపడ్డానని తెలియజేశారు అమ్మ రాజశేఖర్.

Read more RELATED
Recommended to you

Latest news