దిల్ రాజు విజయ్ సినిమా వారీసు 210 కోట్ల వసూళ్ళు వర్షం.!

-

దిల్ రాజు నిర్మాణం లో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  హీరో విజయ్ నటిచిన  వారీసు సినిమా  తమిళనాడు లో విడుదల అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లు పెట్టి మరీ భారీ ఎత్తున తీశారు.ఇక  వారిసూ ను వారసుడును తెలుగు లో  ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా తెర వెనుక మంత్రాంగం నడిచి 14 కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

సంక్రాంతి పండుగ బరిలో కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి  వాల్తేరు వీరయ్య  సినిమా అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా లు ఉండటం వల్ల వెనక్కి వెళ్ళింది. తెలుగు లో మాత్రం వారసుడు సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్ళు సాధించడం లేదు.కాని  తమిళంలో మాత్రం వారిసు కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్కడ విజయ్ కు వున్న స్టామినా వల్ల సినిమా బాగా వసూళ్ళు వర్షం కురిపిస్తూ ఉంది.

ఇక సంక్రాంతి పండుగ సీజన్ ఉండటం తో, అలాగే సినిమా లో ఫ్యామిలీ లు మెచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఉండటం వల్ల అక్కడ మంచిగా ఆడుతోంది. ఇక రీసెంట్ గా  ఈ వారం రోజుల్లో అయితే ఈ చిత్రం మొత్తం 210 కోట్ల సెన్సేషనల్ మార్క్ ని చేరినట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. దీనితో వారిసు అయితే విజయ్ కెరీర్ లో మరో 200 కోట్ల గ్రాసర్ గా అయితే నిలిచింది. ప్రస్తుతానికి అన్ని భాషలు సహా ఓవర్సీస్ లో కూడా వసూళ్లుకూడా బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news