అనసూయ బుల్లితెరకు వచ్చి ఎంత సంపాదించిందో తెలుసా..?

-

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక అలా వచ్చిన క్రేజ్ తోనే ఈమె పలు సినిమాలలో అవకాశాలు సంపాదించుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాలలో కూడా పలు పాత్రలో నటిస్తూ ఉంది అనసూయ. బుల్లితెరపై యాంకర్ గా కంటే సినిమాలలో నటించడం ద్వారానే అనసూయ ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటోందని చెప్పవచ్చు. దీంతో అనసూయ బుల్లితెరకు దూరమైందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అనసూయ జబర్దస్త్ నుంచి బయటికి రాగానే రేటింగ్ పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇలా అనసూయ బుల్లితెరపై, సినిమాలలో నటిస్తూనే భారీగానే ఆస్తులు సంపాదించిందని సమాచారం. ప్రస్తుతం అనసూయ రూ.40 కోట్ల రూపాయలు అటు ఇటుగా ఉన్నట్లు సమాచారం. ఇక పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించి బాగా పేరు సంపాదించుకుంది. అయితే అనసూయ సరైన కథల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ సాధించడం గ్యారెంటీ అని అభిమానులు భావిస్తూ ఉన్నారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా అనసూయ కీలకమైన పాత్రలో నటించింది.

అనసూయ బుల్లితెరపై ప్రసారమయ్యే ఒక్కో ఎపిసోడ్ కు రూ.6 లక్షల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ బుల్లితెరకు రి ఎంట్రి ఇవ్వాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ పలు విదేశాలకు సైతం వెలుతు అందుకు సంబంధించి ఫోటోలను,వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అప్పుడప్పుడు పలు విషయాల పైన కూడా ట్రోల్ అవుతూ ఉంటుంది అనసూయ. ప్రస్తుతం అనసూయ ఆస్తి గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news