ఈ విషయం తెలిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేరుగా …!

-

కరోనా వైరస్ .. చైనాలోని వ్యూహాన్ నగరం లో పుట్టిన అత్యంత ప్రాణాంతకమైన వైరస్. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తుంది. కేవలం ఒక్క ఇటలీలోనే రోజుకు 700 మంది దాకా మరణిస్తున్నారు. అమెరికా, బారత దేశాలతో పాటు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఈ కరోనా భయంతో ప్రజలు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న సన్నివేశం కనిపిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోను ప్రజలను ఇంటి నుండి బయటకు రాకుండా ప్రభూత్వాలు చర్యలు చేపట్టారు. ఈ కరోనా ప్రభావంతో దేశంలోని సామాన్య ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీల పై కూడా విపరీతంగా ఉంది.

 

కరోనా వల్ల రీసెంట్ గా చిత్రసీమలో షూటింగ్ జరుపుకుంటున్న చిన్న సినిమాల దగ్గర్నుంచి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అన్ని సినిమాల షూటింగులు నిలిపి వేశారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ప్రభాస్ కూడా తన 20వ సినిమా షూటింగ్ ఆపేసి ఇంట్లో కూర్చున్నాడు. ఈ పరిస్థితిలో అసలు కరోనా పరిస్థితులు ఇప్పుడప్పుడే సద్దుమణిగే అవకాశాలు కనిపించకపోవడం తో.. ఈ షూటింగ్ పూర్తిచేస్తారు.. అన్న సందేహాలు ప్రభాస్ చిత్రయూనిట్ తో పాటు ఫ్యాన్స్ లోను నెలకొన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే గనక కంటిన్యూ అయితే టాలీవుడ్ లో అన్ని సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చోవడమే.

ఈ లెక్కన చూస్తే ప్రభాస్ 20వ సినిమా ఇప్పుడప్పుడే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తయ్యో ఛాన్సే లేదు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై సినీ ప్రేక్షకులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ తో ఈ సంవత్సరం ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యో అవకాశాలు కనిపించకపోవడం తో ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూసే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news