నయనతారకి కరోనా.. అసలు మ్యాటర్ ఇదేనట..!

-

దేశంలో కరోనా విజృంబిస్తుంది.. దీన్ని ధాటికి అందరూ వణుకుతున్నారు. అయితే అంతకుమించి ఫేక్ న్యూస్ లు ప్రజలను ఎక్కువగా భయపెడుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకొని వారు కరోనా బారిన పడ్డారంటూ సోషల్ మీడియా వేదికగా పుకార్లు పుట్టిస్తున్నారు కొందరు. ముఖ్యంగా ఇది తారల విషయంలో ఎక్కువగా ఉంది. ప్రముఖ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ కరోనా బారినపడ్డారని, వారికి కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలపై వారిద్దరి ప్రతినిధి స్పందించారు. నయనతార, విఘ్నేశ్ ల ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని, వారికి కరోనా సోకిందనడం ఓ పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, చెన్నైలోని తమ నివాసంలో ఉన్నారని వెల్లడించారు. దయచేసి ఎవరూ అసత్య కథనాలను ప్రచారం చేయొద్దని విజ్జప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news