వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రిసెప్షన్‌లో తారల సందడి

-

సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన వరలక్ష్మి తన వైవిధ్యమైన నటన, పాత్రలతో అలరించారు. తాజాగా ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముంబయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్‌ గ్యాలరీ నిర్వాహకుడు నికోలయ్‌ సచ్‌దేవ్‌ను ఆమె పెళ్లాడారు.థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ -నికోలయ్‌ సచ్‌దేవ్‌ల వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌ నటీనటులు ఈ రిసెప్షన్‌లో సందడి చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు. బాలకృష్ణ, వెంకటేశ్‌, రజనీకాంత్‌, సిద్ధార్థ్‌, ఖుష్బూ, శోభన, మంచు లక్ష్మి రిసెప్షన్‌లో సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇత వకలక్ష్మి టాలీవుడ్, కోలీవుడ్లో నటిగా రాణిస్తుండగా నికోలయ్ ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. 14ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news