‘ ప్ర‌తి రోజు పండగే ‘…. మారుతి మ‌ళ్లీ ఫ్యామిలీతో చంపేశాడు

-

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.  బర్త్ డే గిఫ్ట్ గా తేజు కొత్త సినిమా ‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు రిలీజ్ అయింది. ఇక కొద్ది రోజులుగా వ‌రుస‌గా ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న సాయి చిత్ర‌ల‌హ‌రి సినిమాతో కాస్త ట్రాక్‌లోకి వ‌చ్చాడు. చిత్ర‌ల‌హ‌రి ఓ మోస్తరుగా యావ‌రేజ్ టాక్‌తో ఆడేసింది.

ఇక ఇప్పుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ప్ర‌తి రోజు పండ‌గే సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. 40 సెక‌న్ల పాటు ఉన్న వీడియోలో అన్ని షాట్లు చూస్తుంటే ఈ సినిమాను మారుతి కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించాడ‌ని తెలుస్తోంది. ఇక రాశీఖ‌న్నాతో ప్రేమాయ‌ణం…. అటు తండ్రి సెంటిమెంట్… అంద‌మైన కుటుంబం… చ‌క్క‌టి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఇలా అన్ని క‌లిగ‌లిపిన క‌థ‌తో ప్ర‌తి రోజు పండ‌గ సినిమా ఉంటుంద‌ని అర్థ‌మైంది.

ఇక అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎస్ఎస్‌.థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. గ్లింప్స్‌లో నేప‌థ్య సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ హైలెట్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌ల్లో ఎక్క‌డా రాజీప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news