సాయితేజ్ రాశిఖ‌న్నాతో పండ‌గ‌చేసుకుంటున్నాడుగా…!

-

సుప్రీం హీరో సాయితేజ్‌, హీరోయిన్ రాశీఖ‌న్నా కాంబినేష‌న్ “ప్రతిరోజు పండగే” చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాసు నిర్మాతగా అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. ఆ తరువాత షెడ్యూల్ ని అమెరికాలో షూట్ చేస్తారు. అక్టోబర్ 15న సాయి తేజ్ పుట్టినరోజు వేడుకలు సినిమా సెట్స్ లో జరిగాయి.

సుప్రీమ్ హీరో సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ముచ్చటగా ఉన్నాయి. తాత & మనవడు మధ్య రిలేషన్ ను ఈ సినిమాలో అందంగా చూపించడం జరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news