మెగా అభిమానులకు పండుగే.. ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్..!!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఆచార్య’గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కాగా, ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ పైన భారీ అంచనాలున్నాయి. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ అక్టోబర్ 5న విజయ దశమి కానుకగా విడుదల కానుంది.

ఈ క్రమంలోనే మెగా అభిమానులకు విజయ దశమి కంటే ముందే మరొక పండుగ ఇచ్చేందుకు మెగాస్టార్, మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను తీసుకురావాలని అనుకుంటున్నారట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ఫిల్మ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ను తీసుకురావాలనుకుంటున్నారని సమాచారం.

పవన్ ప్రజెంట్ సినిమాలతో పాటు పాలిటిక్స్ లోనూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ ఈ ఈవెంట్ కు వస్తే హైలైట్ అవుతుందని అనుకుంటున్నారట. మూవీ యూనిట్ సభ్యులు ఈ విషయమై ఆల్రెడీ పవన్ కల్యాణ్ ను అప్రోచ్ కాగా, ఆయన ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ లో చిరంజీవికి చెల్లెలిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ ప్లే చేయగా, ఆయనతో పాటు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఒక పాత్ర పోషించారు

. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఒక పాటకు ఇండియన్ మైఖైల్ జాక్సన్ అయిన ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఆ సాంగ్ లో చిరు, సల్లూ భాయ్ స్టెప్ లు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news