పవన్ కళ్యాణ్ తొలిప్రేమ మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జీవీజీ రాజు..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కీర్తి రెడ్డి హీరోయిన్ గా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా తొలిప్రేమ. 1998లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. ఇందులో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. సింపుల్ లవ్ స్టోరీ.. ఎమోషనల్ సీన్స్.. మంచి సాంగ్స్.. కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించింది అని చెప్పవచ్చు. అంతేకాదు అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలైనా సందర్భంగా తొలిప్రేమ సినిమాను జూన్ 30వ తేదీన చాలా గ్రాండ్గా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా చిత్ర యూనిట్ అంతా విచ్చేశారు. ఎస్ఎస్సి ఆర్ట్స్ బ్యానర్ పై జీవిజీ రాజు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో జీవిజీ రాజు ఒక ప్రైవేటు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. జీవీజీ రాజు మాట్లాడుతూ.. తొలిప్రేమ సినిమాకి పవన్ కళ్యాణ్ కు లక్షల్లోనే పారితోషకం ఇచ్చాము అయితే ఎన్ని లక్షలు ఇచ్చాము అన్నది చెప్పను.

సినిమా ఓకే అయ్యాక రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. నేను ఇంత ఇవ్వగలను మీకు ఎంత కావాలి.. మొత్తం ఒకేసారి ఇవ్వాలా లేదా కొంచెం కొంచెం ఇవ్వాలా అని అడిగాను.. పవన్ కళ్యాణ్ మీ ఇష్టం అన్నారు.. అయితే ముందుగా కొంచెం అడ్వాన్స్ ఇచ్చాను మిగిలిందంతా ఒకేసారి సినిమా రిలీజ్ అయ్యాక ఇస్తాను అని చెబితే ఆయన మాట్లాడుకుండా ఓకే చెప్పారు. అయితే సినిమా అయిపోయేలోపు నెల వారీ ఖర్చులకు కొంత అమౌంట్ మాత్రం ఇవ్వండి అని అడిగాడు. అందుకు ఓకే చెప్పాను. సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే మొత్తం పారితోషకం తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టాను అంటూ పలు కామెంట్లు చేశారు జీవీజీ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news