క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడ్డ హంసనందిని.. పోస్ట్ వైరల్..!

-

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు రకరకాల వ్యాధుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారు ఆ అనారోగ్య సమస్యలతో పోరాడి బయటపడగలుగుతున్నారు. అలాంటి వారిలో హంసనందిని కూడా ఒకరు. క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించింది. కంప్లీట్ గా క్యాన్సర్ ను జయించి సరికొత్తగా ఆడియన్స్ కు దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా కాలం పాటు క్యాన్సర్ మహమ్మారితో యుద్ధం చేసింది ఈ ముద్దుగుమ్మ. క్యాన్సర్ వల్ల ఎంతో బాధను అనుభవించింది. చాలా కాలం క్రితం నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న ఈమె ఆ మధ్య కోలుకొని షూటింగ్స్ కి కూడా హాజరయ్యింది. ఈ క్రమంలోని పూర్తిగా కోలుకొని బయట ప్రపంచంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాను అంటూ తన సంతోషాన్ని ఒక పోస్ట్ రూపంలో తెలియజేసింది హంస నందిని.

తన వెన్నంటే ఉంటూ తన కష్టంలో సపోర్టుగా నిలిచిన అభిమానులకు, ఫాలోవర్స్ కు ఒక్క సింగిల్ వార్డులో పెద్ద థాంక్స్ చెప్పేసింది . ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడ రెస్టారెంట్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. వెల్కమ్ బ్యాక్ అంటూ రాసిన ప్లేట్ కూడా ఈ ఫొటోలో కనిపిస్తుంది. టాలీవుడ్ ఐటెం బాంబుగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మిర్చి , అత్తారింటికి దారేది, శౌర్యం, సోగ్గాడే చిన్నినాయన వంటి ఎన్నో చిత్రాలలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన ఈమె సడన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది . 2022 ఏడాది ఆరంభంలో తాను ఈ వ్యాధి బారిన చిక్కుకున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించింది. ఇక అప్పటినుంచి క్యాన్సర్ తో పోరాడి ఎట్టకేలకు క్యాన్సర్ ను జయించింది. మొత్తానికైతే మొదటిసారి ఈమెను ఇలా చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news