తిరుమలలో గదుల ధరలు పెంచడంపై TTD క్లారిటీ

-

తిరుమలలో గదుల ధరలు పెంచడంపై TTD క్లారిటీ ఇచ్చింది. తిరుమలలోని ఎస్వి గెస్ట్ హౌస్, నారాయణగిరి విశ్రాంతి గృహాల్లో భక్తుల కోరిక మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టి, అక్కడి వసతులకు అనుగుణంగా గదుల అద్దె నిర్ణయించినట్లు TTD శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

‘విశ్రాంతి గృహాల్లో 30 ఏళ్ల క్రితం అప్పటి వసతులకు అనుగుణంగా అద్దె నిర్ణయించారు. అప్పటి నుంచి అదే మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు భక్తులు ఏసీతో పాటు అధునాతన సౌకర్యాలు కల్పించాలని సలహాలు, సూచనలు ఇవ్వగా ఆ మేరకు పనులు చేపట్టాం. నూతన ఫర్నిచర్, ఏసి, గీజర్లు తదితర వసతులు కల్పించాం అని TTD పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news