మహేష్ మామూలోడు కాదండోయ్…..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ఘోర పరజలయ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో అత్యద్భుత విజయాన్ని అందుకుని, ఆ సూపర్ డూపర్ సక్సెస్ తో కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని అందుకోవడం జరిగింది. ఇక దాని తరువాత ఈ ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాతో మరొక అద్భుత విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్, కెరీర్ లో హ్యాట్రిక్ విజయాల కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్న మహేష్ బాబు, ఇప్పటికే ఈ సినిమా కోసం తన వంతుగా ప్రమోషన్స్ చేయడానికి భారీగానే ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం.

కొద్దిరోజలుగా ఎక్కువగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ కథల్లో నటిస్తూ వస్తున్న సూపర్ స్టార్, ఆగడు సినిమా తరువాత మళ్ళి ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు ద్వారా మరొక్కసారి తనలోని కామెడీ యాంగిల్ ని బయటకు తీయనున్నారు. కామెడీ డైలాగ్స్ చెప్పడంలో మహేష్ ప్రత్యేకతే వేరు. ఇక ఫ్యాన్స్ కూడా మహేష్ నుండి ఇటువంటి సినిమా ఎప్పటి నుండో ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో, సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా, జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న జరగనుండగా, ఆ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రానున్నారు.

 

అయితే మొదటి నుండి పవర్ స్టార్ కు సరిసమానమైన ఇమేజ్, మార్కెట్ ఉన్న సూపర్ స్టార్ కు, మెగా ఫ్యాన్స్ లో కొందరి నుండి వ్యతిరేకత ఉందని, అయితే దానిని చాలా వరకు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఒకింత తెలివిగా మెగాస్టార్ ని ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానిస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది అనే విషయం అటుంచితే, సరిలేరు ఫంక్షన్ కు మెగాస్టార్ రావడం మాత్రం తప్పకుండా ఆ సినిమాకు కొంత వరకు మేలు చేకూర్చే అంశమేనని, ఈ విషయమై మహేష్ ఆలోచన సూపర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!

Read more RELATED
Recommended to you

Latest news