హీరో సిద్ధార్థ కు సొంత రాష్ట్ర విమానాశ్రయంలోనే చేదు అనుభవం.

-

ప్రముఖ హీరో సిద్ధార్థ కు ఘోర అవమానం ఎదురయింది విమానాశ్రయంలో అతని తల్లిదండ్రితో పాటు అతన్ని సైతం చాలాసేపు సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని స్వయంగా అతను సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు..

హీరో సిద్ధార్థ తమిళనాడుకు చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే అయితే ఆయనకు తన సొంత రాష్ట్రం అయినా తమిళనాడు మదురై ఎయిర్పోర్టులో చేదు అనుభవం ఎదురయింది.. తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సిద్ధార్థ తిరిగి వస్తుండగా మధుర విమానాశ్రయంలో సిఆర్పిఎఫ్ సిబ్బంది అతనిని అడ్డుకున్నారు అంతేకాకుండా కారణం లేకుండా చాలా సేపు దుర్భాషలాడారు..

అయితే అసలు తనను వాళ్ళు ఎందుకు ఇలా తిడుతున్నారో అర్ధం కాక.. సిద్థార్ధ్ వారిని వారించే ప్రయత్నం చేశాడట. ఆయన వెంట వృద్ధాప్యంలో ఉన్న సిద్దార్ధ్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తన తల్లిదండ్రుల జేబులు, బ్యాగుల్లో ఉన్న డబ్బును, ఇతర వస్తువులను బయటకు తీయాలంటూ.. సిఆర్పిఎఫ్ సిబ్బంది ఆర్డర్ధ్ వేశారు. అంతే కాదు అర్ధం కాకుండా హిందీలో మాట్లాడుతూ సిద్థు ఫ్యామిలీని దుర్బాషలు ఆడారు. అంతే కాదు ఇంగ్లిష్‌ లో మాట్లాడాలని వారిని ఎంతగా వేడుకున్నా వినకుండా మాటల దాడి చేశారంటూ సిద్థు ఆవేదన వ్యాక్తం చేశారు. ఇక ఈ ఘటనపై విమానాశ్రయంలో అధికారులకు సిద్దార్థ్‌ కంప్లైయింట్ కూడా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.. అలాగే 20 నిమిషాలు పాటు తనను ఎంతగానో ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news