హీరోయిన్ చేసిన పని సినిమా కొంప ముంచింది…!

-

బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయానికి వెళ్ళడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత ఆదివారం జరిగిన హింస నేపధ్యంలో ఆమె విద్యార్ధులను పరామర్శించడానికి గాను అక్కడికి వెళ్ళారు. మంగళవారం సాయంత్రం దీపిక పదుకొనేని విశ్వ విద్యాలయంలో చూసి పలువురు ఆశ్చర్యపోయి ఆమెపై విమర్శలు చేసారు.

ఆమె విపక్షాలకు మద్దతు ఇవ్వొచ్చు తప్పు లేదు గాని ఇలాంటి చర్యలకు మద్దతు ఇచ్చి దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారని ఆమెపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బిజెపి నేతలు ఆమె క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేయడం విశేషం. ముఖ్యంగా హిందుత్వ సంస్థలు ఆమెను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ తరుణంలో ఆమె నటించిన ఒక సినిమాకు పెద్ద కష్టం వచ్చింది. ఆమె ఇటీవల యాసిడ్ దాడి బాధితురాలి లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ చపాక్ లో నటించింది. ఇప్పుడు ఆ సినిమాను బ్యాన్ చెయ్యాలని పలువురు పిలుపు ఇస్తున్నారు. హిందువులు ఆమె సినిమా చూడవద్దని కోరుతున్నారు. మెజారిటీలు గా ఉన్న హిందువులు ఆమె సినిమా చూడకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news