నాకు కేజీయఫ్ లాంటి సినిమా చేయాలని ఉంది..!!

-

నటుడు సాయి కుమార్ కొడుకు యంగ్ హీరో ఆది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎంతగా కష్టపడుతూ ఉన్నా గాని సరైన హిట్ రావటం లేదు. కాని తను మాత్రం విడిచి పెట్టకుండా వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ, నటిస్తూ నే ఉన్నాడు.రీసెంట్ గా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

ఆది హీరోగా కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో టాప్ గేర్ సినిమా రాబోతోంది. తెరకెక్కింది.శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వస్తున్న  ఈ సినిమా  డిసెంబర్ 30న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరొ ఆది మీడియాతో ముచ్చటించాడు. తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో క్యాబ్ డ్రైవర్‌గా నటించానని, అతని జీవితంలో తనది కాని చిక్కుల్లో పడతాడని, మొత్తం సినిమా త్రిల్లర్ కాదని తెలిపాడు.

ప్రస్తుతం మాస్ సినిమాలు మంచి హిట్స్ గా మారుతున్నాయని, ఇక మాస్ కా బాప్ కేజీయఫ్ టాప్ లెవెల్ కు వెళ్లిందని నాకు అలాంటి అవకాశం వస్తే అలాంటి మాస్ సినిమా చేయాలని ఉందని ఆది అన్నాడు. ఇక తన తండ్రి సినిమాలు, పాటలను రీమేక్ చేయాలని ఉందట. అంతఃపురంలోని అసలేం గుర్తుకు రాదు అనే పాటను రీమేక్ చేయాలని ఉందని , డైరెక్టర్ కృష్ణవంశీయే దానికి న్యాయం చేస్తాడని తన మనుసులో కోరిక గురించి చెప్పుకొచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news