శంషాబాద్ లోని రాయల్ విల్లా కాలనీలో సివిల్స్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

-

శంషాబాద్ లోని రాయల్ విల్లా కాలనీలోపూజిత (27) అనే సివిల్స్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి స్వస్థలం ఇబ్రహీంపట్నం. శంషాబాద్ లో అద్దె గదిలో ఉంటూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంది పూజిత. మహమ్మద్ అలీ అనే వ్యక్తి పూజితతో సన్నిహితంగా మెలిగేవాడని.. పూజిత మృతికి మహమ్మద్ అలీనే కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.

దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. “శంషాబాద్ లో పూజిత (26) అనే యువతి అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని విండోకు చున్నీతో మెడకు ఉరి వేసుకుంది. మృతదేహం కుల్లిపోవడంతో మూడు రోజుల క్రితం అత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పూజిత స్వస్తలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 2018 లో భారత్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి బిటెక్ పూర్తి చేసింది. నాలుగు నెలల క్రితం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లస్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటూ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేయిర్ అవుతుంది. పూజిత మృతికి కారణం ప్రేమ అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు”.

Read more RELATED
Recommended to you

Latest news