అక్షయ్ కుమార్ ప్లాన్స్ వర్కౌట్ అయితే బాలీవుడ్ కూడా ఆయన్నే ఫాలో అవుతుందా ..?

-

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గత నాలుగేళ్ళుగా వరసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటున్న ఖాన్ ల త్రయాన్ని మించిపోయాడు. ప్పాలంటే ఇంత లాంగ్ టైం ఇన్ని సక్సస్ లను బాలీవుడ్ లో ఈ మద్య కాలంలో మరే హీరో దక్కించుకోలేదనే చెప్పాలి. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కమర్షియల్ పంథా అని కాకుండా సామాజిక అంశాలతోనే అక్షయ్ దాదపు 4 సినిమాలతో హిట్స్ అందుకోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. జాలీ ఎల్ ఎల్ బి 2, టాయిలెట్ ఏక్ ప్రేం కథ, పాడ్ మాన్, మిషన్ మంగళ్, కేసరి, గుడ్ న్యూస్ ..ఇలా అద్భుతమైన హిట్స్ ను అందుకున్నాడు.

 

ఇక రీసెంట్ గా వచ్చిన హౌజ్ ఫుల్ 4 తోను కమర్షియల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్, సూర్య వంశీ అన్న సినిమాలలో నటిస్తున్నాడు. కొరియోగ్రాఫర్ కం హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన లక్ష్మీ బాంబ్ హారర్ కామెడీ బ్యాగ్డ్రాప్ లో రూపుందుతుంది. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు కంప్లీటయిందని సమాచారం. వాస్తవంగా అయితే రంజాన్ కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కాని లాక్ డౌన్ తో చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.

ఇక షూటింగ్స్ మొదలు అయినప్పటికీ థియేటర్స్ బంద్ కారణంగా ఇప్పట్లో మూవీ విడుదల చేసే పరిస్థితి లేదని తెలిసిందే. దీనితో లక్ష్మీ బాంబ్ సినిమాని ఓ టి టి లో విడుదల చేయాలని అక్షయ్ కుమార్ అనుకుంటున్నారట. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి తేవాలనే అక్షయ్ ఆలోచనకి మేకర్స్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన కాంచన కి రీమేక్ గా హిందీలో లక్ష్మీ బాంబ్ ని రూపొందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news