జై భీమ్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

-

మలయాళం సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రజీషా విజయన్. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన జై భీమ్ సినిమాలో స్కూల్ టీచర్ పాత్రలో ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక అంతకుముందు ధనుష్ తో కర్ణన్ సినిమాలో కూడా ఈమె నటించగా ఈమెకు మంచి పేరు లభించింది అని కూడా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తమిళ్, మలయాళ భాషలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె ప్రస్తుతము రవితేజతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది.

ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా.. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ తో పాటు రజీషా విజయన్ కూడా హీరోయిన్ నటించింది. మీడియాతో తాజాగా ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ తన ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది.రజిషా మాట్లాడుతూ కొత్త భాషలో పరిచయం అవుతున్నప్పుడు ఒక బలమైన పాత్ర అవసరమవుతుంది. నేను ఎదురు చేసిన కొలతలతోనే మాలతి పాత్రను చాలా అందంగా బలంగా డిజైన్ చేశారు.

ఇంత మంచి పాత్రతో తెలుగుకు పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె తెలిపింది. ఇక ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే స్వయంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటాను అని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ నేను ఉత్తరాదిలో పెరిగాను. నాన్న ఆర్మీలో, ఆ తర్వాత సిబిఐ లో కూడా పనిచేశారు. ట్రాన్స్ఫర్ లు ఎక్కువగా ఉండడం వల్ల నేను కేరళలో నివసించలేదు.

ఇక నేను ఎక్కువగా హిందీలోనే సినిమాలు చూశాను. రవితేజ చిత్రాలు కూడా హిందీలో చాలా వచ్చేవి. నాకు నా స్నేహితులందరికీ కూడా ఆయన బాగా తెలుసు. అప్పుడు ఆయన్ని నేను హిందీ హీరో అనుకున్నాను అని ఆమె చెప్పింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే రవితేజకు చాలా క్రితమే రీచ్ ఉంది. నేను అతడి వీరాభిమానిని. కానీ ఆయన సినిమాలోనే నాకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news