ఆచార్య: ధర్మస్థలి కోసం 20ఎకరాల్లో సెట్.. భారతదేశంలోనే అతి పెద్దది..

-

2021వ సంవత్సరంలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్ బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఆచార్య సినిమా కోసం భారతదేశంలో అతి పెద్ద సెట్ నిర్మిస్తున్నారట. 20ఎకరాల్లో ధర్మస్థలి సెట్ నిర్మాణం జరుగుతుందట.

క్రిష్ 3, అగ్నీపథ్, భరత్ అనే నేను చిత్రాలని ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన సురేశ్ః సెల్వరాజన్ ఈ 20ఎకరాల సెట్ ని రూపుదిద్దే కార్యక్రమాల్లో ఉన్నాడట. హైదరాబాద్ శివార్లలో 20ఎకరాల స్థలంలో ధర్మ స్థలి రూపుదిద్దుకుంటుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసం 30రోజుల సమయాన్ని రామ్ చరణ్ కేటాయించాడట. చిరంజీవి, రామ్ చరణ్ లు కలిసి, ఒకపాటకి స్టెప్పులు వేస్తారని చెప్పుకుంటున్నారు. ఆ వివరాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news