సమంత మాటలు విని చైతన్య మనసు మార్చుకోబోతున్నాడా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఏ మాయ చేసావే సినిమాతో జంటగా పరిచయమైన వీరిద్దరూ మొదటి సినిమాతోనే స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించుకొని .. మనం సినిమా తర్వాత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సమంత పలు టీవీ యాడ్స్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది. క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరు ఉన్నట్టుండి గత ఏడాది అక్టోబర్ రెండవ తేదీన విడాకులు తీసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు.అయితే ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం మాత్రం వెల్లడించలేదు.

విడాకుల తర్వాత సమంత పై నెగిటివ్ ట్రోల్స్ , కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి .కానీ సమంత వాటిని దృష్టిలో పెట్టుకోకుండా తన కెరియర్ పైన దృష్టి సారించింది. అలా బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ . పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది .నాగచైతన్య కూడా వరుస విజయాలను అందుకుంటూ తన కెరియర్ పైన దృష్టి సారించారు . ఇదిలా ఉండగా సమంత నటించిన యశోద సినిమా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉండగా సరిగ్గా వారం కిందట తాను మయో సిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించి అందరిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

కండరాల సమస్యతో తాను బాధపడుతున్నట్లు తెలిపిన సమంతను చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు ఆమె త్వరగా కోలుకోవాలని ఆమెకు పోస్టుల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆమె మాజీ భర్త నాగచైతన్య కూడా వెళ్లి సమంతను కలిసి ప్రత్యేకంగా ఆమెను ఓదార్చడం జరిగింది. అక్కడ సమంత నాగచైతన్యను చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. ఈ క్రమంలోనే సమంత తన ఆరోగ్య పరిస్థితిని చైతుకి చెప్పగానే ఆయన విడాకులు అనే విషయాన్ని రద్దు చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి నాగచైతన్య సమంత చెప్పిన మాటలు విని విడాకులు రద్దు చేసుకుంటే చూసి ఆనందించాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news