ఆ పాత్ర సాయిపల్లవికి సరిపోదా.. అందుకే పవన్ సినిమాకి నో చెప్పిందా..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా మొదలెట్టబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో మళయాల చిత్రమైన అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేవారి కోసం వేట సాగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని సంప్రదించారట. కానీ సాయి పల్లవి ఆ ఆఫర్ ని తిరస్కరించిందని టాక్.

పవన్ తో పాటు మరో హీరో కూడా ఉండే ఈ సినిమాలో హీరోయిన్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. ఇద్దరు హరోల మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అందువల్ల హీరోయిన్ కి ఏమంత ముఖ్యపాత్ర ఉండదు. అందువల్లే సాయి పల్లవి ఆ పాత్రని నిరాకరించి ఉంటుందని సమాచారం. మరి నిజంగా సాయి పల్లవిని సంప్రదించారా లేదా పవన్ పక్కన ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయాలు అధికారికంగా ప్రకటిస్తే గానీ బయటకి రావు.

Read more RELATED
Recommended to you

Latest news