‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ట్రైలర్ రిలీజ్

-

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ ట్రైలర్‌ను ఇవాళ చిత్రబృందం విడుదల చేసింది. కొంతకాలంగా సరైన హిట్స్‌లేని అల్లరి నరేష్‌కు ‘నాంది’ చిత్రం సూపర్ హిట్‌ని ఇచ్చింది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్‌సో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నరేష్ ’ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే మూవీతో నవంబరు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్నమైన కథతో అల్లరి నరేష్‌ మరోసారి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో ఆనంది కథానాయిక. జీ స్టూడియోస్‌  సమర్పణలో, హాస్య మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ – జీ స్టూడియోస్ వారు నిర్మిస్తుండగా, ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అల్లరి నరేశ్ గవర్నమెంట్ ఆఫీసర్‌గా కనించనున్నారు. ఎలక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో గిరిజనులు, వారి కష్టాలపై అల్లుకున్న కథగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news