హీరోయిన్ల రెమ్యూనరేషన్ పై హాట్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..!!

-

బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ కి సీతారామం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయ్యింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇందులో ఈమె నటనకు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ విషయంపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ కు సంబంధించి ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఒక చానల్లో ఇమే పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. రెమ్యూనరేషన్ విషయంలో హీరోయిన్స్ నిక్కచ్చిగా వ్యవహరించాలని తెలియజేసింది. ప్రేక్షకుల్లో మనకున్న ఇమేజ్ను బట్టి వారి యొక్క పారితోషకం ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తున్నారని తెలియజేస్తోంది. కానీ కొంతమంది కథానాయకులు మాత్రం తాము కోరుకున్న రెమ్యూనిరేషన్ ని డిమాండ్ చేసే విషయంలో చాలా అయోమయంలో ఉన్నారని కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ముందే స్పష్టంగా చెప్పగలిగాలి అప్పుడే మనం మన వృత్తిలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో మనకి అర్థమవుతుందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

మృణాల్ ఠాకూర్  కు సీతారామం చిత్రంతో తన డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఏమి ప్రస్తుతం ఒక చిత్రానికి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు సీరియల్ లో కూడా నటించింది. ముఖ్యంగా మరాఠీ సినిమా” విట్టిదండు” చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. అటు తరువాత హిందీ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అలా స్టార్ హీరోల సరసన కూడా నటించింది. మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news