జ‌పాన్ అమ్మాయిలు ప్ర‌భాస్ ఇంటి ముందు ఏం చేశారో చూడండి!

-

కొంత మంది జ‌పాన్ అభిమానులు ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని ప్ర‌భాస్ ఇంటికి చేరి సంద‌డి చేశారు. ఆయ‌న్ని క‌లిసేందుకు వ‌చ్చి ఇంటి ముందు నృత్యం చేస్తూ, ఫొటోల‌కు పోజులిచ్చారు. అయితే ఇంత‌కి వారికి ప్ర‌భాస్ క‌లిశాడా? లేదా అన్న‌ది స‌స్పెన్స్ గానే ఉంది.

డార్లింగ్ ప్ర‌భాస్ ని జ‌పాన్ అమ్మాయిలు స‌ర్ ప్రైజ్ చేశారు. త‌న ఇంటి ముందు త‌మ‌దైన నృత్యాల‌తో ఆడిపాడారు. ఫొటోల‌కు పోజులిచ్చి సంద‌డి చేశారు. ఇంత ఆ విశేషాలు చూస్తే ప్ర‌భాస్‌కి బాహుబ‌లి చిత్రంలో అంత‌ర్జాతీయంగా మంచి మార్కెట్ ఏర్ప‌డింది. ఆయ‌న ఇమేజ్ ఖండాంత‌రాలు దాటింది. ముఖ్యంగా జ‌పాన్ వంటి దేశంలో అది మ‌రింత ఎక్కువ‌. బాహుబ‌లి సినిమా అక్కడ ఘ‌న విజ‌యం సాధించింది. అక్క‌డి ఆడియెన్స్ ని , త‌న ఫ్యాన్స్ ని ప్ర‌భాస్ క‌లిసి వారితో ఫొటోలు కూడా దిగారు. అంతేకాదు ప‌లు బ‌హుమ‌తులు కూడా అంద‌జేశారు. అందుకుగానూ వారు ప్ర‌భాస్‌కి తిరిగి గిఫ్ట్ లు పంపించారు.

ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు అరుదైన ఫొటోలు పంపించారు. అలా త‌ర‌చూ జ‌పాన్ అభిమానులు ప్ర‌భాస్‌తో, వారితో ప్ర‌భాస్ ట‌చ్‌లోనే ఉన్నారు. త‌మ సినిమాల‌కి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్‌ని వారికి తెలియ‌జేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. అక్క‌డి అభిమానుల్లో మ‌హిళ‌లు చాలానే ఉన్నారు. ప్ర‌భాస్ అందం, ఫిజిక్‌కి ప‌డిపోయే అమ్మాయిలు ఎంతో మంది. అలా ప‌డిపోయిన కొంత మంది జ‌పాన్ అభిమానులు ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని ప్ర‌భాస్ ఇంటికి చేరి సంద‌డి చేశారు. ఆయ‌న్ని క‌లిసేందుకు వ‌చ్చి ఇంటి ముందు నృత్యం చేస్తూ, ఫొటోల‌కు పోజులిచ్చారు. అయితే ఇంత‌కి వారికి ప్ర‌భాస్ క‌లిశాడా? లేదా అన్న‌ది స‌స్పెన్స్ గానే ఉంది.

ఇదిలా ఉంటే ప్ర‌భాస్‌ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఆమెకిది తొలి తెలుగు సినిమా. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్‌,విక్కీ సంయుక్తంగా తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. అత్యంత స్ట‌యిలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ప‌లువురు హాలీవుడ్ టెక్నిషియ‌న్లు ప‌నిచేస్తున్నారు. భారీ టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్న ఈసినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దాదాపు ఐదేండ్ల త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న క‌మ‌ర్షియ‌ల్ సినిమా కావ‌డంతో అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఏక‌కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి స్వ‌తంత్ర దినోత్స‌వ కానుక‌గా ఆగ‌స్ట్ 15న చిత్రం విడుదల చేయ‌బోతున్నారు.

మ‌రోవైపు జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో పూజా హెగ్డే క‌థానాయిక‌గా ఎంపికైంది. కృష్ణంరాజు, వంశీ, ప్ర‌మోద్‌, విక్కీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version