ఎన్టీఆర్ హీరోయిన్ కి కరెంట్ బిల్లు షాక్..!

-

లాక్ డౌన్ తర్వాత అధికారులు పంపిస్తున్న కరెంట్ బిల్లులు సామాన్యులకే కాదు సెలబ్రిటీలు కూడా షాక్‌ ఇస్తున్నాయి. సంవత్సరం మొత్తంగా కూడా రాని బిల్లు ఒక్క నెలలోనే వచ్చేసరికి ప్రజల్లో ఆందోళన ఏర్పడింది. దీంతో అనేక మంది సామాన్యులు ప్రభుత్వాలకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా నటి కార్తీకకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. తను ఉంటున్న ఇంటికి అక్షరాలా లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది.

దీంతో షాక్ తిన్న కార్తీక.. లాక్‌ డౌన్‌ లో క‌రెంటు మీట‌ర్ రీడింగ్ తీయ‌లేదని… లాక్‌ డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత 3 నెల‌ల రీడింగ్ ఒకేసారి తీశారని తెలిపింది. దీని కారణంగానే ఒక్క జూన్ నెల‌లోనే త‌న‌కు ల‌క్ష బిల్లు వ‌చ్చిందని కార్తీక పేర్కొంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన కార్తీక.. ముంబైలో ఏ కుంభ‌కోణం జ‌రుగుతోంది అంటూ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.

తెలుగు, తమిళంలో సక్సెస్‌ ఫుల్ హీరోయిన్‌ గా పేరొందిన నటి కార్తీక. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అక్కినేని వారసుడు నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చిన జోష్ చిత్రంలో, అలాగే దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో జత కట్టింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ అంటూ అల్లరి నరేష్ సినిమాలో కూడా నటించింది. కాగా, ఆ మధ్య హీరోయిన్ స్నేహ భర్తకు కూడా ఇలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news