అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్న కాజల్ అగ‌ర్వాల్‌..

-

దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు దక్కించుకుంది. వయసు పెరిగినా వన్నె తగ్గని హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ముందువరుసలో ఉంటుంది. ఇప్పటికీ ఆమె ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా అమ్మడికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు బొమ్మ ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు ఈ అందాల అభినేత్రి కొలతలు తీసుకున్నారు. ఇప్పటివరకు దక్షిణాది నుంచి ఏ హీరోయిన్ కు దక్కని భాగ్యం ఇది. మరే సౌతిండియా భామ మేడమ్ టుస్సాడ్స్ లో స్థానం దక్కించుకోలేకపోయింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా, ఇప్ప‌టికే దక్షిణాది నుంచి.. తొలిసారిగా ప్రభాస్ ఈ మ్యూజియంలో మైనపు బొమ్మగా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో కొలువైన మేడమ్ టుస్సాడ్స్‌లో రీసెంట్‌గానే పెట్టారు. ఇప్పుడు కాజ‌ల్ ఈ గౌర‌వాన్ని ద‌క్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news