డ్రగ్స్ కేసులో రకుల్‌ ప్రీత్‌..? కంగన రనౌత్ కి నోటీసులు..!

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే బాలీవుడ్ ని కుదిపేస్తుంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి రిమాండ్ లో ఉంది. అలాగే ఆమె తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో భాగంగా మొత్తం 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తేలింది. దీంతో వారికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో కంగన రనౌత్ ని విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

ఆమెను విచారించే బాధ్యతను ముంబై పోలీసులకు అప్పగించింది. దీంతో విచారణకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా.. 25 మంది ప్రముఖుల పేర్లకు సంబంధించిన టైమ్స్‌ నౌ ప్రచారం చేసిన కథనం ఒకటి సంచలనంగా మారింది. ఆ లిస్టులో.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ సన్నిహితురాలు సైమోన్‌ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news