ఉల్లి పొరలాంటి వస్త్రాల్లో కీర్తి సురేశ్..ఈ భామ సొగసులు చూడతరమా!

-

అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్..మొదటి సినిమాతోనే యూత్ లో క్రేజీ క్రేజీ ఫీలింగ్ తెప్పించేసింది. అటు తర్వాత వరుస సినిమాలతో కుర్రకారు గుండెల్ని మెలిపెట్టి తిప్పేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2016లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను శైలజ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ సుందరి..నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రకు 100 శాతం న్యాయం చేసి జాతీయ స్థాయిలో మహనటిగా గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది.

కీర్తి సురేశ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా లైట్ క్రీమ్ కలర్ శారీలో కూల్ లుక్స్‌తో ఉన్న ఫొటో ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. సదరు ఫొటోలో మెరుపు సోయగాలతో కత్తి లాంటి చూపులతో కైపెక్కిస్తోంది. ఉల్లి పొరలాంటి కొంగుతో మెరిసే శారీలో అందాలన్నీ అలా చూపించేస్తోంది. ఎద అందాలతో పాటు అదరాలను చూసి నెటిజన్లు అదరహో అనుకుంటున్నారు. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘ఎవర్ ఎలిగెంట్,అమేజింగ్,ఓల్డ్ కీర్తి ఈజ్ బ్యాక్’’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ మహేశ్ కు జోడీగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఈ నెల 12 న విడుదల కానుంది. ప్రజెంట్ కీర్తి ‘రెండు జెళ్ల సీత, భోళా శంకర్,దసరా’ చిత్రాలలో నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కీర్తి నటించిన ‘చిన్ని’ ఇటీవల విడుదలైంది. డీ గ్లామర్ లుక్ లో ఈ పిక్చర్ లో కీర్తి సురేశ్ అదరగొట్టింది.

https://www.instagram.com/p/CdV9ytnJHtk/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news