చరణ్ లో ఆ యాంగిల్ బయటపెట్టిన కియరా

-

బాలీవుడ్ నుండి టాలీవుడ్ బాట పట్టిన భామ కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని బయోపిక్ సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సినిమాలోనే ఛాన్స్ అందుకుంది. భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే రాం చరణ్ తో సినిమా చేస్తుంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేస్తుంది కియరా అద్వాని.

ఇక ఈ సినిమా షూటింగ్ లో చరణ్ అల్లరి గురించి చెబుతుంది కియరా అద్వాని. తానో స్టార్ అయినా సరే చరణ్ చాలా సరదాగా ఉంటారని. చరణ్ చాలా చిలిపి అంటుంది కియరా. మరి ఇన్నాళ్లు మనకు తెలిసిన చరణ్ జోవియల్ కాం గోయింగ్ అలాంటిది చరణ్ లో చిలిపి తనం ఉంది అంటూ కియరా నొక్కి మరి చెప్పడం. చరణ్ చిలిపిగా కియరాని ఏం చేస్తున్నాడబ్బా అని డౌట్ మొదలైంది.

ఈమధ్య బాలీవుడ్ లో నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన లస్ట్ స్టోరీస్ లో కియరా పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. ఎక్స్ ప్రెషన్స్ తో చంపేస్తున్న అమ్మడికి సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. లేటెస్ట్ గా ఓ తమిళ సినిమా ఆఫర్ కూడా కొట్టేసిందట కియరా అద్వాని. మొత్తానికి మహేష్ సినిమాతో అమ్మడి గ్రాండ్ ఎంట్రీ కెరియర్ కూడా అంతే గ్రాండ్ గా ఉండేలా చేసిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news