టాలీవుడ్ బాట ప‌డుతున్న కియారా.. కొర‌టాల వ‌ద‌ల‌ట్లేదుగా!

-

చేసిన రెండు సినిమాల‌తోనే తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్ని కొల్ల‌గొట్టింది కియారా అద్వానీ. ఆమె చేసిన భ‌ర‌త్ అనేనేను, విన‌య విధేయ రామ సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాయి. అయినా స‌రే ఆమె టాలీవుడ్‌లో పెద్ద‌గా ఇంట్రెస్ట్ పెట్ట‌కుండా బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్క‌డ మాత్రం బాగానే చాన్సులు కొట్టేస్తోంది. వ‌రుసగా స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది.

 

అయితే ఆమె టాలీవుడ్‌కి రావాల‌ని చాలామంది కోరుకుంటున్నారు. ఇక ఇదే విష‌యంపై కియారా కూడా క్లారిటీ ఇచ్చేసింది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి మ‌ళ్లీ ఎప్పుడు వ‌స్తున్నారంటూ ప్రశ్నించాడు ఓ నెటిజ‌న్‌. దీనికి ఆమె స‌మాధానం ఇస్తూ త్వరలోనే ఎంట్రీ ఇస్తానంటూ హింట్ ఇచ్చేసింది.

ఇప్పటికే ఆమె ఎన్టీఆర్ 30వ సినిమాలో చేస్తోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీటికిబ‌లం చేకూరేలా ఆమె చెప్పిన న్యూస్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ క‌లిసి చేస్తున్న సినిమాలో కియారాకు అవ‌కాశం వ‌చ్చింద‌ని స‌మ‌చారం. కొర‌టాల శివ ఇప్పిటికే కియారాతో క‌లిసి చేయ‌డం కార‌ణంగా ఆమెకు మ‌రోసారి ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనేదీనిపై ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news