కోలీవుడ్ ఫేక్ ఇండస్ట్రీ.. అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు

-

ప్రేమఖైది సినిమా నుండి తెలుగు, తమిళ భాషల్లో చేసింది తక్కువ సినిమాలైనా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న భామ అమలా పాల్. దర్శకుడు విజయ్ తో ప్రేమ పెళ్లి, రెండేళ్లు గడిచాక విడాకులు ఇదంతా కెరియర్ లో భాగమే అనుకున్న అమలా మళ్లీ సినిమాలను చేస్తూ వచ్చింది. మళయాల భామ అయిన అమలా పాల్ తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది.

అలాంటి అమ్మడు తమిళ పరిశ్రమ మీదే సంచలన ప్రకటన చేసింది. బాలీవుడ్ లో కమర్షియల్ అంశాలను పెద్దగా పట్టించుకోరని.. కంటెంట్ ఉన్న సినిమాలు అక్కడ సక్సెస్ అవుతాయని అన్నది. అయితే తమిళ పరిశ్రమ అలా కాదని అందుకే ఇది ఫేక్ ఇండస్ట్రీ అని అన్నది అమలా పాల్. ఇక్కడ పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుతుంది అమలా. అమ్మడు చేసిన ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.

ఇక్కడ ఉంటూ ఈ ఇండస్ట్రీపై ఇలాంటి వ్యాఖ్యలు సహించేది లేదని అంటున్నారు. అమలా నటించిన రీసెంట్ మూవీ తిరుట్టు పయలే-2 అనుకున్న విధంగా ఆడలేదు. పదేళ్ల క్రితం వచ్చిన తిరుట్టు పయలే సినిమాకు సీక్వల్ గా ఈ సినిమా వచ్చింది. ఇందులో బాబీ సింహా హీరోగా చేయగా అమలా పాల్ నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ఇండస్ట్రీకి ఏంటి సంబంధమో కాని అనవసరంగా అమలా నోరు జారిందని మాత్రం చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news