కొత్తబంగారు లోకం భామకు పెళ్లైంది..!

-

దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వరుణ్ సందేష్ హీరోగా వచ్చిన సినిమా కొత్తబంగారు లోకం. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత బసు ప్రసాద్. టాలీవుడ్ నుండి దూరంగా వెళ్లిన ఈ అమ్మడు అనురాగ్ కశ్యప్ ప్రొడక్షన్ లో జాయిన్ అయ్యింది. ఫాంటం ఫిల్మ్ ప్రొడక్షన్ లో పనిచేస్తున్న శ్వేతా బసు ప్రసాద్ అక్కడ డైరక్టర్ రోహిత్ మిట్టల్ ను ప్రేమించింది.

రోహిత్ కూడా శ్వేతా బసు ప్రేమను యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లికి అనురాగ్ కశ్యప్ సపోర్ట్ గా నిలిచారని తెలుస్తుంది. కొత్తబంగారు లోకం సినిమాతో యువతను ఆకట్టుకున్న శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్ లో నుండి కొన్ని అనివార్యకారణాల వల్ల వెళ్లిపోయిందని తెలిసిందే. ఇప్పటికైనా ఆమె జీవితం మరో కొత్త బంగారు లోకం అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు ఆమె అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news