క్రిష్ బుల్లితెర ఫోకస్..!

-

సక్సెస్ ఫుల్ డైరక్టర్ క్రిష్ ఓ పక్క కంగనా లీడ్ రోల్ చేసిన మణికర్ణిక పోస్ట్ ప్రొడక్షన్ చూస్తూనే మరోపక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా షూట్ చేస్తున్నాడు. ఇవి రెండు చేయడానికే షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు అనుకుంటుంటే ఈలోగా బుల్లితెర మీద సీరియల్స్ కు కథ అందిస్తున్నాడట క్రిష్. గమ్యం నుండి శాతకర్ణి వరకు తన ప్రతిభ చాటుతూ వస్తున్న క్రిష్ నిర్మాతగా స్మాల్ స్క్రీన్ పై స్వాతి చినుకులు సినిమా ప్రొడ్యూస్ చేశాడు.

అది కాకుండా లేటెస్ట్ గా ఓ ఛానెల్ కోసం పల్లెటూరి పిల్ల అనే సీరియల్ కు కథ కూడా అందించాడట. క్రిష్ అందించిన ఈ కథతో సీరియల్ రాబోతుందని తెలుస్తుంది. ఈ కథ కూడా సినిమా పరిశ్రమకు సంబందించినదిగా ఉంటుందట. పల్లెటూరి నుండి వచ్చి హీరోయిన్ అవుదామనుకునే కలలు కనే అమ్మాయి కథ అని తెలుస్తుంది.

క్రిష్ బుల్లితెర ఫోకస్ అందరిని ఆశ్చర్యపరచింది. కొందరు ఇంతన్ని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో పోల్చుతున్నారు. కరణ్ టివి షోస్ హోస్ట్ చేస్తాడు ఆ ఒక్కటి తప్ప కరణ్ లానే క్రిష్ సినిమా డైరక్షన్ తో పాటుగా సీరియల్స్ కు కథ అందిస్తూ తన సత్తా చాటుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news