OTTలో ‘‘రంగ మార్తాండ’’..కృష్ణవంశీ ప్లాన్?

-

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ ఫిల్మ్ కోసం సినీ అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ‘నక్షత్రం’ పిక్చర్ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న పిక్చర్ ఇది. ఈ మూవీ మరాఠీ హిట్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు రీమేక్.

ఈ చిత్రంలో కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, ‘బిగ్ బాస్’ ఫేమ్ అలి రెజా నటించారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందంల పాత్రలు ఈ మూవీలో హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి గాన గాంధర్వుడు ఇళయరాజా మ్యూజిక్ అందించారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది.

Director Pasupuleti Krishna Vamsi at Paisa Movie Logo Launch Photos

ఈ చిత్ర విడుదల తేదీ కోసం చాలా కాలం నుంచి మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వలన పిక్చర్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పిక్చర్ ను OTTలో రిలీజ్ చేయాలని చర్చలు జరుగుతున్నట్లు టాక్. పిక్చర్ ఓటీటీ రిలీజ్ కు ఓ ఓటీటీ రూ.20 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి..‘రంగ మార్తాండ’ ఓటీటీలో విడుదలవుతుందో..లేదా థియేట్రికల్ రిలీజ్ అవుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news